భూమా నాగిరెడ్డి కూతురు భూమా అఖిల ప్రియ కు సికింద్రాబాద్ లోని సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.బోయిన్ పల్లికి చెందిన భూ వ్యవహారంలో ప్రవీణ్ సోదరులను అపహరణ కేసులో ఆమె నూ చంచల్ గూడ జైల్లో గత 16 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆమె ఇంతకు ముందు కూడా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది.అనారోగ్యం సమస్యతో భాదపడుతున్న అంటూ పిటిషన్ లో పేర్కొంది.
ఈలాంటి సమయంలో ఆమె కు బెయిల్ ఇస్తే కేసు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయని పోలీసుల తరుపు లాయర్ ఆమెకు బెయిల్ ఇవ్వకుండా మూడు రోజులపాటు పోలీసు కస్టడికి అప్పగించాలని కోర్టును కోరుతూ పిటిషన్ ధాఖలు చేశాడు.
కోర్టు తీర్పు నేపథ్యంలో అప్పుడు ఆమెకు బెయిల్ మంజూరు కాలేదు.
పైగా పోలీసు విచారణకు హాజరు కావాలని సికింద్రాబాద్ కోర్టు ఆదేశాలు జారీచేసింది.తాజాగా మరోసారి బెయిల్ ఇవ్వాలని కోర్టు లో పిటిషన్ వేసింది.
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కోర్టు 10 వేల రూపాయల పూచీకత్తు మరియు ఇద్దరు వ్యక్తుల షూరిటీలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ విషయమై కోర్టులో పిటిషన్ ధాఖలు చేశాడు.
కేసు ధర్యాప్తు ఉన్న సమయంలో బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టును ఆశ్రయించారు.కోర్టు కూడా ముందస్తు బెయిల్ ను కొట్టివేసింది.
రేపు అఖిల ప్రియ జైలు నుండి విడుదల కానున్నది.