కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా మరోసారి యాత్రను నిర్వహించనున్నారన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో యాత్రకు ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ గా నామకరణం చేశారు.
ఈ మేరకు భారత్ జోడో యాత్ర లోగో, స్లోగన్ ను ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు.ఈ నెల 14 నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేయనున్నారని తెలిపారు.
మణిపుర్ నుంచి ముంబై వరకు బస్సు యాత్ర కొనసాగుతుందని ఖర్గే పేర్కొన్నారు.భారత్ న్యాయ యాత్రతో మరోసారి ప్రజల్లోకి వెళ్తున్నామని స్పష్టం చేశారు.