మరో తెలుగు సీరియల్ హీరో కి కరోనా వైరస్ పాజిటివ్...

ప్రస్తుతం తెలుగు బుల్లితెరలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది.

ఇప్పటికే పలువురు సీరియల్ నటీనటులు ఈ కరోనా వైరస్ బారినపడి సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండగా మరో సీరియల్ నటుడు భరద్వాజ్ కి కరోనా వైరస్ సోకినట్లు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా  ఓ వీడియోని షేర్ చేస్తూ తెలిపాడు.

అయితే ఇందులో భాగంగా ఇటీవల తాను కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకున్నానని ఈ ప్రక్రియలో తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని తెలిపాడు.అలాగే తనకు కరోనా వైరస్ లక్షణాలయిన జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం వంటివి లేవని కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  చెప్పుకొచ్చాడు.

అంతేగాక తనతో పాటు ఇన్ని రోజులు షూటింగుల్లో పని చేసినటువంటి ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఈ వీడియో ద్వారా తెలిపాడు.అలాగే ముందుగా ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ గురించి నెగిటివ్ వార్తలని ప్రచారం చేయవద్దని వైద్యుల సలహా మేరకు సూచనలు మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టవచ్చునని తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో భరద్వాజ్ ఇటీవల ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన టువంటి జయ జానకి నాయక అనే చిత్రంలో ప్రముఖ విలన్ తమ్ముడి పాత్రలో నటించాడు.ప్రస్తుతం భరద్వాజ్ స్వాతి చినుకులు, బంధం, తదితర సీరియళ్ళలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు