అప్పట్లో చిరంజీవి.. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ ఇద్దరికి మాత్రమే సాధ్యమైనది ఏంటంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఇకపోతే అప్పట్లో చిరంజీవి కూడా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం కోసం దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అంకుశం ఈ సినిమాతో హిందీలో ప్రతిబంద్ అనే రీమేక్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు.

తెలుగు లో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు,హిందీలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు.

బాలీవుడ్ లో హీరో చిరంజీవి కి, అదే విధంగా దర్శకుడు రవిరాజా పినిశెట్టి కి అదే మొదటి సినిమా.నిర్మాతగా అల్లు అరవింద్ కూడా ఈ సినిమాతోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.అదే విధంగా ఈ సినిమాలో నటించిన దివంగత నటుడు రామిరెడ్డికి కూడా ఇదే మొదటి బాలీవుడ్ మూవీ.

ఇది ఇలా ఉంటె చాలా ఏళ్ల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చత్రపతి సినిమా హిందీలో రీమేక్ తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు.ఈ సినిమాతో వివి వినాయక్ దర్శకుడిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.హీరోగా బెల్లంకొండను టాలీవుడ్ కి పరిచయం చేసిన వినాయక్, ఇప్పుడు బాలీవుడ్ కి కూడా పరిచయం చేయబోతున్నాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు వి.వి.వినాయక్ కు కూడా దర్శకుడిగా ఇది మొదటి బాలీవుడ్ సినిమా.చిరంజీవి బాలీవుడ్ లో మొదటిసారి మంచి సక్సెస్ అందుకున్న ట్లే, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా అదేవిధంగా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి మరి.మొత్తానికి చిరంజీవి బాటలో పయనిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు