ముఖం అందంగా, మృదువుగా, మొటిమలు మరియు మచ్చలు లేకుండా ఉండాలని అందరూ కోరుకుంటారు.అందుకే తరచూ ఫేస్ ప్యాకులు, ట్యాన్ ప్యాకులు, ఫేస్ క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు ఇలా ఎన్నో వాడుతుంటారు.
అయితే ఇలాంటి వాడటం కంటే.న్యాచురల్ రెమెడీస్ పాటించడమే స్కిన్ మేలంటున్నారు బ్యూటీషన్లు.
ముఖ్యంగా ఆవిరి పట్టడం అనేది చర్మానికి ఎంతో మంచిది.అయితే నార్మల్ వాటర్తో కాకుండా.
కొన్ని కొన్ని పదార్థాలు కలిపి ఆవిరి పడితే.ఎన్నో చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ముడతలు, సన్నని గీతలు సమస్యతో బాధ పడే వారు వాటర్లో కొద్దిగా కొబ్బరి నూనె మరియు బాదం నూనె వేసి మరిగించాలి.ఈ నీటితో నాలుగు నుంచి ఆరు నిమిషాల పాటు ఆవిరి పట్టాలి.
ఇలా స్టీమింగ్ చేసినప్పుడు చర్మ కణాలను తెరుచుకొనేలా చేసే తేమనందిస్తుంది.దాంతో ముడతలు, సన్నని చారలు దూరమై.
చర్మం మృదువుగా మారుతుంది.
అలాగే మొటిమలు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటే.
వాటర్లో చిటికెడు పసుపు, తులసి ఆకులు వేసి మరిగించాలి.ఈ నీటితో నాలుగు నుంచి ఆరు నిమిషాల పాటు ఆవిరి పట్టి మెత్తని క్లాత్తో ముఖాన్ని క్లాన్ చేసుకోవాలి.
పావు గంట అనంతరం రెండు నిమిషాల పాటు ఐస్ క్యూబ్ తో ముఖాన్ని మర్ధన చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల మొటిమలు మరియు నల్ల మచ్చలు కూడా దూరం అవుతాయి.
ఇక ముఖంపై మృతకణాలు తొలగించి చర్మాన్ని క్లీన్, కాంతివంతంగా మార్చడంలోనూ ఆవిరి ఉపయోగపడుతుంది.వాటర్లో గ్రీన్ టీ బ్యాగ్ వేసి బాగా మరిగించి.ఈ నీటితో నాలుగు నుంచి ఆరు నిమిషాల పాటు ఆవిరి పట్టాలి.ఇలా చేయడం వల్ల చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ పోయి.
అందంగా, తాజాగా మారుతుంది.