ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద బతుకమ్మ వేడుకలు తొలిసారిగా నిర్వహించనున్నారు.కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి.
సాయంత్రం 6 గంటలకు కర్తవ్య పథ్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో సంబురాలు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమాల్లో మహిళా ఐఏఎస్లు, ఐపీఎస్లు, పలువురు మహిళా కేంద్రమంత్రులు పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు.
బతుకమ్మ విశిష్టటతను దేశ ప్రజలకు చాటి చెప్పడానికే ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.