నేడు ఇండియా గేట్ వద్ద బతుకమ్మ వేడుకలు

ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద బతుకమ్మ వేడుకలు తొలిసారిగా నిర్వహించనున్నారు.కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి.

సాయంత్రం 6 గంటలకు కర్తవ్య పథ్‎లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో సంబురాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమాల్లో మహిళా ఐఏఎస్‎లు, ఐపీఎస్‎లు, పలువురు మహిళా కేంద్రమంత్రులు పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు.

బతుకమ్మ విశిష్టటతను దేశ ప్రజలకు చాటి చెప్పడానికే ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.

జగన్ చంద్రబాబు కి అందిన సర్వే నివేదికలు .. క్లారిటీ వచ్చిందా రాజా ?