హైదరాబాద్ లోని బండ్లగూడ, పోచారం రాజీవ్ స్వగృహ ప్లాట్లు మరోసారి వేలానికి రానున్నాయి.మిగిలిన ఫ్లాట్లను హెచ్ఎండిఏ వేలం వేయనుంది.
గతంలో అమ్ముడుపోని ప్లాట్ లన్ని వేలం వేనున్నారు.ఈ క్రమంలో రిజిస్టర్ చేసుకున్న వారికి మరో అవకాశం కల్పించనున్నారు.ఈ నేపథ్యంలో టోకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకుహెచ్ఎండిఏ మరో అవకాశం ఇచ్చింది.1 BHK కు రూ.లక్ష, 2 BHK కు రూ.2 లక్షలు, 3 BHK కు రూ.3 లక్షలు టోకెన్ అడ్వాన్స్ అని తెలిపారు.ఈ టోకెన్ అడ్వాన్స్ చెల్లింపుకు అక్టోబర్ 26చివరి తేదీ అని పేర్కొంది.
అయితే లాటరీ పద్ధతిలో హెచ్ఎండిఏ ప్లాట్లను కేటాయించనుంది.