టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే.రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తెలుగులో గీత గోవిందం, డియర్ కామ్రేడ్,అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా వున్నాడు.ఇది ఇలా ఉంటే విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం లైగర్.
ఈ సినిమాకు దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు హీరోయిన్ ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తోంది.
కాగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల కానున్న విషయం తెలిసింది.
ఇటీవల తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.లైగర్ సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చిన ఆనంద పడుతున్న అభిమానులు ఏకంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
రౌడీ హీరో భారీ కటౌట్ పెట్టి దానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి నానా రచ్చ చేశారు.అటు సోషల్ మీడియానూ లైగర్ హ్యాష్ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తూ రచ్చ రచ్చ చేయడంతో అభిమానుల హడావుడి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన విజయ్ పలు వ్యాఖ్యలు చేశాడు.
ఈ సందర్భంగా విజయ్ ఆనందంతో మాట్లాడుతూ.మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడూ తెల్వదు.నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయితుంది.రిలీజ్ అయిన సినిమా కూడా పెద్దగా చెప్పుకునే మూవీ కాదు.
అయినా ట్రైలర్కు ఈ రచ్చ ఏందిరా నాయన.అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.అయితే విజయ్ టాలీవుడ్లో మెగా హీరోలను ఉద్దేశించే ఈ కామెంట్లు చేశాడన్న ఆరోపణలు వినిపించడంతో తాజాగా బండ్ల గణేశ్ విజయ్ అన్న మాటలపై స్పందిస్తూ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి.
ఎన్టీఆర్లా, మహేశ్బాబులా, రామ్చరణ్లా, ప్రభాస్లా. గుర్తుపెట్టుకో బ్రదర్ అని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.
కాగా కొందరు ఇది రౌడీ హీరోకు కౌంటర్ ఇచ్చినట్లు ఉందని అనగా ఇంకొందరు మాత్రం ప్రభాస్, రామ్చరణ్, మహేశ్బాబు, ఎన్టీఆర్లను విమర్శించినట్లు ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.