బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.ఇప్పటికే నాలుగు విడతల ప్రజా సంగ్రామ యాత్రను పూర్తి చేసిన బీజేపీ చీఫ్.
ఇప్పటివరకు 48 నియోజకవర్గాల్లో 1,260 కిలోమీటర్ల మేర యాత్ర చేశారు.అక్టోబర్ 15 నుంచి ఐదో విడత పాదయాత్రను ప్రారంభించనున్నారని సమాచారం.
నిర్మల్ జిల్లా బాసర అమ్మవారిని దర్శించుకుని భైంసా నుంచి కరీంనగర్ వరకు ఈ యాత్రను కొనసాగించనున్నారు.