తెలంగాణలో లాక్ డౌన్ పై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.. ?

తెలంగాణలో రేపటి నుండి పది రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ లాక్‌డౌన్ అమలు ప్రతీ రోజు ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం పై దూకుడుగా ప్రవర్తించే బండి ఈ సారి మాత్రం సానుకూలంగానే స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము మద్దతిస్తామని, ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్ డౌన్ ను ప్రకటించాయని, ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగానైనా లాక్ డౌన్ ప్రకటించిందని అన్నారు.

ఇక లాక్ డౌన్ సమయంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగకుండా వేగంగా కొనసాగేలా చూడాలని సూచించారు.అంతే కాకుండా లాక్ డౌన్ సమయంలో కరోనా టెస్టులు, రోగులకు చికిత్స ఆగకుండా చూడాలని ప్రభుత్వాన్ని బండి సంజయ్ కోరారు.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు