తెలంగాణలో లాక్ డౌన్ పై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.. ?

తెలంగాణలో రేపటి నుండి పది రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ లాక్‌డౌన్ అమలు ప్రతీ రోజు ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది.

 Bandi Sanjay Interesting Comments On Lock Down In Telangana State, Telangana, Ba-TeluguStop.com

ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం పై దూకుడుగా ప్రవర్తించే బండి ఈ సారి మాత్రం సానుకూలంగానే స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము మద్దతిస్తామని, ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్ డౌన్ ను ప్రకటించాయని, ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగానైనా లాక్ డౌన్ ప్రకటించిందని అన్నారు.

ఇక లాక్ డౌన్ సమయంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగకుండా వేగంగా కొనసాగేలా చూడాలని సూచించారు.అంతే కాకుండా లాక్ డౌన్ సమయంలో కరోనా టెస్టులు, రోగులకు చికిత్స ఆగకుండా చూడాలని ప్రభుత్వాన్ని బండి సంజయ్ కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube