నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ సినిమా తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
అఖండ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ఆ సినిమాకు దక్కిన 200 కోట్ల వసూళ్లు చూస్తుంటేనే అర్థం అవుతుంది.ఇక బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో కూడా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.9 కంటే ఎక్కువ రేటింగ్ ను దక్కించుకుని ఇండియా లోనే టాప్ రేటెడ్ టాక్ షో గా నిలిచింది.ఇలాంటి ఒక అరుదైన ఘనత బాలయ్య అన్ స్టాపబుల్ దక్కించుకుంటుందని ఎవరు ఊహించలేదు.
ఒక అద్బుతమైన టాక్ షో ను ఆహా తెలుగు ప్రేక్షకులకు అందించింది.ఆహా వారు తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 1 ను ముగిస్తున్నట్లుగా ప్రకటించారు.
అధికారికంగా అన్ స్టాపబుల్ ను మహేష్ బాబు ఎపిసోడ్ తో ముగిస్తున్నట్లుగా తేల్చి చెప్పడంతో అంతా కూడా అయ్యో అంటున్నారు.
బాలయ్య టాక్ షో ను కంటిన్యూ గా చేస్తే బాగుంటుంది కదా అంటూ ఉన్నారు.
అయితే ఇలాంటి టాక్ షో లు కంటిన్యూ గా చేయడం కుదరని పని.పదిహేను.ఇరవై ఎపిసోడ్ లు కలిపి ఒక సీజన్ గా చేస్తూ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది.బాలయ్య షో సక్సెస్ అయ్యింది కనుక ముందు ముందు సీజన్ లు చాలా వస్తాయి.
సమంత సామ్ జామ్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా ఆశించారు.కాని నిరాశ పర్చింది.
దాంతో అన్ స్టాపబుల్ లా కాకుండా సామ్ జామ్ ఒక్క సీజన్ కే ముగిసింది.కాని బాలయ్య టాక్ షో ను మాత్రం సీజన్ లకు సీజన్ లు కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారు.ఫిబ్రవరి లో మొదటి సీజన్ ను ముగించబోతున్నారు.రెండవ సీజన్ ను ఇదే ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ లో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దం అవుతున్నారు.ఇప్పటి నుండే గెస్ట్ ల జాబితాను సిద్దం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఆహా వారు ఖచ్చితంగా బాలయ్యను ఈసారి మరింత ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా సీజన్ 2 ను తీసుకు వస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది.