బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న( Sardar Sarvai Papanna ) 314 వ వర్ధంతి వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మంగళవారం గీత పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొరల అరాచకాలను దౌర్జన్యాలను ఎదిరించి పోరాడిన వీరుడని కొనియాడారు.ఈకార్యక్రమంలో పందుల యాదగిరి,బద్దం యాదయ్య,నీళ్ల గాలయ్య, మొగుదాల సత్తయ్య,రాపర్తి బుచ్చయ్య,నీళ్ల యాదయ్య, ఐటిపాముల అంజయ్య, పెద్దగోని విష్ణు,సూర్వి లింగస్వామి,శ్రీశైలం,కృష్ణయ్య, దూసరి నారాయణ,బి.
సురేష్, అంతటి ఇస్తారి,బద్దం జంగయ్య తదితరులు పాల్గొన్నారు.







