బాబుకు షాక్‌.. ఆ మతం నుంచి భారీ సెగ‌.. సీన్ రివ‌ర్స్ అయ్యిందే...!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు భారీ సెగ త‌గులుతోందా?  కీల‌క‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న క్రిస్టియ‌న్ల నుంచి చంద్ర‌బాబుపై విమ ర్శ‌ల వెల్లువ వ‌స్తోందా?  అంటే.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇటీవ‌ల కొన్నాళ్లుగా రాష్ట్రం లోని ప‌లు హిందూ ఆల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నాయి.వీటిని ఎవ‌రు చేస్తున్నారో.

ఎందుకు చేస్తున్నారో.వీటి వెనుక ఎవ‌రు ఉన్నారో.

కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.ఈ విష‌యంపై సీరియ‌స్‌గా ఉన్న జ‌గ‌న్ స‌ర్కారు.

Advertisement

ఈ దాడుల అంతు తేల్చేందుకు యుద్ధ ప్రాతిప‌దిక‌న సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌తో సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది.ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌తీర్థం ఘ‌ట‌న విష‌యంపై దృష్టి పెట్టింది.

అయితే.రామ‌తీర్థం ఘ‌ట‌న ప్రాంతాన్ని ప‌రిశీలించిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

ఆల‌యాల‌పై దాడులను అరిక‌ట్ట లేక‌పోతున్నారంటూ.ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.చంద్ర‌బాబు త‌న ధోర‌ణిలో చేసిన విమ‌ర్శ‌ల్లో క్రిస్టియ‌న్ మ‌తంపైనా విమ‌ర్శ‌లుగుప్పించారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

రాష్ట్రంలో క్రిస్టియ‌న్ ముఖ్యమంత్రి ఉన్నాడు క‌నుక ఈ దాడులు చేయిస్తున్నార‌ని అనేశారు.ఉద్దేశ పూర్వ‌కంగా అన్నారో.

Advertisement

లేక అన్యాప‌గా బాబు నోటి నుంచి వ‌చ్చిందో తెలియ‌దు కానీ.ఇప్పుడు ఇదే వ్యాఖ్య సంచ‌ల‌నం సృస్టిస్తోంది.

బాబు వ్యాఖ్య‌ల‌కు నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఫిలిప్‌ సి తోచర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు రాజీనామా పత్రాన్ని పంపారు.

చంద్రబాబు వైఖరి, ఆ పార్టీ వైఖరి అసహ్యం పుట్టింద‌ని ఫిలిప్ వ్యాఖ్యానించారు.అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మెడలో శిలువ వేసుకుని, బైబిల్‌ చదువుతూ నా జన్మధన్యమైందని ప్రకటించుకున్నారని గుర్తు చేసిన ఫిలిప్‌.రాజకీయాల కోసం క్రైస్తవులను అవమానిస్తున్నారన్నారు.

రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులంతా చంద్రబాబు పార్టీలో ఎలా కొనసాగుతున్నారంటూ తమపై ఒత్తిడి చేస్తున్నారన్నారు.క్రైస్తవులను అవమానాలకు గురిచేస్తున్న టీడీపీ,  చంద్రబాబు వైఖరి నచ్చక పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

అయితే.ఫిలిప్ చేసిన వ్యాఖ్య‌లు క్ష‌ణాల్లోనే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క్రైస్త‌వుల‌ను కార్న‌ర్ చేసిన టీడీపీ నేత‌లు మొహం చాటేశారు.నిజానికి సీఎం జ‌గ‌న్‌పై ఉన్న అక్క‌సుతో క్రైస్త‌వుల‌ను మొత్తాన్నీ టార్గెట్ చేయ‌డంతో ఇప్పుడు ఏకంగా టీడీపీకి ప్ర‌ధాన ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీలు, బీసీల్లో చాలా మంది దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు.

మ‌రి.దీని నుంచి బాబు ఎలా బ‌య‌ట ప‌డ‌తారో చూడాలి.

ఏదేమైనా.బీజేపీని హైజాక్ చేయ‌బోయి.

బాబు బోర్లా ప‌డ్డార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజా వార్తలు