ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడాపోటీలు ప్రారంభం

ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు ప్రారంభం అయ్యాయి.ఈ మేరకు ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 రోజులపాటు క్రీడా సంబురం జరగనుంది.

 'audham Andhra' Sports Competitions Have Started In Ap-TeluguStop.com

గుంటూరు జిల్లా నల్లపాడులో ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలను సీఎం జగన్ ప్రారంభించారు.గ్రామ, వార్డు నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు జరగనుండగా ఈ పోటీల్లో దాదాపు 34 లక్షల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇది అందరూ పాల్గొనే గొప్ప పండుగని చెప్పారు.ఈ క్రీడా సంబురాలు దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతాయన్నారు.

ఆరోగ్యం సరిగా ఉండాలంటే జీవితంలో క్రీడలు చాలా అవసరమని పేర్కొన్నారు.క్రీడల వలన అనారోగ్య సమస్యలు దూరమవుతాయన్న సీఎం జగన్ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube