అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు రక్షణ లేకుండా పోతుంది.ఓ కామాంధుడు మైనర్ బాలుడిపై అత్యాచారానికి పాల్పడటానికి యత్నించాడు.
దీంతో ఆ బాలుడు కేకలు వేయడంతో కుటుంబసభ్యులు రావడం చూసి ఆ కామ పిశాచి పరారయ్యాడు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలుడిపై ఓ కామాంధుడు అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన దుబాయిలో చోటు చేసుకుంది.
యూరప్ కు చెందిన దంపతులు తమ కొడుకు(14)తో కలిసి దుబాయిలో ఉంటున్నారు.అయితే వాళ్లు ఉంటున్న ఇంట్లో బాత్రూమ్ లో నీళ్లు సరిగ్గా రావడం లేదు.దీంతో బాలుడి తండ్రి ప్లంబర్ ని సంప్రదించాడు.బాత్రూమ్ లో నీళ్లు రావడం లేదని రిపేర్ చేయమని అడిగాడు.
దీంతో వాళ్లింటికి వచ్చిన ప్లంబర్ బాత్రూమ్ రిపేర్ చేస్తున్నాడు.
ఇంట్లో వాళ్లు తమ తమ పనిలో బిజీ అయ్యారు.
అదే అదునుగా భావించిన ఆ ప్లంబర్ బాలుడితో లైంగికంగా వేధించసాగాడు.అత్యాచారానికి ప్రయత్నించడంతో ఆ బాలుడు బిగ్గరగా కేకలు వేయసాగాడు.
కేకలు విన్న కుటుంబసభ్యులు పరుగులు తీస్తూ బాత్రూమ్ కు చేరుకునేలోపు నిందితుడు పరారయ్యాడు.దీంతో బాధితుడి తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
విచారణ చేపట్టిన న్యాయస్థానం తుది తీర్పును వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసిందని పోలీసులు వెల్లడించారు.