టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కోసం భారీగా ఏర్పాట్లు చేసుకుంటోంది.రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 27న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
దీనికి హైదరాబాద్ లోని హైటెక్స్ లో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ ప్లీనరీని విజయవంతం చేసే బాధ్యతలను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీసుకున్నారు .ఆయన ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రతి యేటా ఘనంగా నిర్వహిస్తున్నట్లు గానే, ఈ ఏడాది అంతకంటే ఎక్కువ ఘనంగా నిర్వహించేలా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
దీనికోసం ప్రత్యేకంగా పార్టీ తరఫున పాసులను జారీ చేస్తున్నారు.ఎంట్రీ పాస్ లు ఉన్న వారిని మాత్రమే వేడుకలకు అనుమతించాలా ప్లాన్ చేసుకున్నారు.ఈ మేరకు ఎంట్రీ పాస్ ఉన్నవారు మాత్రమే వేడుకలకు హాజరుకావాలని, మిగిలిన వారిని అనుమతించమని మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు.దీనిని మరింత సక్సెస్ చేసేందుకు అనేక కమిటీలను మంత్రి కేటీఆర్ ప్రకటించారు.ఈ కమిటీల ఆధ్వర్యంలోనే అన్ని ఏర్పాట్లు జరుగుతాయని కేసీఆర్ ప్రకటించారు.
ఆహ్వాన కమిటీ
1.సబితా ఇంద్రారెడ్డి, 2.ఎంపీ రంజిత్ రెడ్డి, 3.ఎమ్మెల్యే గాంధీ, 4.విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్, 5.మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ,

సభా వేదిక ప్రాంగణం అలంకరణ
1.గోపీనాథ్ ఎమ్మెల్యే, 2.బాలమల్లు, చైర్మన్, 3.మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి చైర్మన్,
ప్రతినిధుల నమోదు, వాలంటరీ
1.సంబల్పూర్ రాజు, ఎమ్మెల్సీ, 2.శ్రీధర్ రెడ్డి రావుల, చైర్మన్, 3.మన్నే కృశాంక్ , చైర్మన్
పార్కింగ్
1.కెపి వివేక్ ఎమ్మెల్యే, 2.బండి రమేష్ పార్టీ జనరల్ సెక్రటరీ, 3.బొంతు రామ్మోహన్ హైదరాబాద్ మాజీ మేయర్,

ప్రతినిధుల భోజనం
1.మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే, 2.ప్రవీణ్ కుమార్ రావు , ఎమ్మెల్సీ, 3.సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే,
తీర్మానాల కమిటీ
1.మధుసూధనాచారి ఎమ్మెల్సీ, 2.పర్యాద కృష్ణమూర్తి, పార్టీ జనరల్ సెక్రటరీ, 3.శ్రీనివాస రెడ్డి మాజీ ఎమ్మెల్సీ,
మీడియా
1.బాల్కా సుమన్ ఎమ్మెల్యే, 2.భాను ప్రసాద్, ఎమ్మెల్సీ, 3.కర్నే ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సీ, 4.గువ్వల బాలరాజు ఎమ్మెల్యే,
.






