కేజీఎఫ్ స్టార్ తో సందీప్ రెడ్డి పాన్ ఇండియా సినిమా

అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి సందీప్ రెడ్డి వంగా.

ఇదే సినిమా రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టి అక్కడ సంచలనం సృష్టించాడు.

ఎన్నో వివాదాల చుట్టూ తిరిగిన ఈ అర్జున్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఓ విధంగా చెప్పాలంటే ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిపోయింది.

అలాగే కబీర్ సింగ్ కూడా బాలీవుడ్ లో వివాదాలకు కారణం అయి సంచలన విజయం అందుకుంది.ఆ సినిమా తర్వాత షాహిద్ కపూర్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.టాలీవుడ్ బడా నిర్మాతలు అతనితో సినిమాలు చేయడానికి కమిట్మెంట్లు చేసుకున్నారు.

Advertisement

మహేష్ బాబు లాంటి స్టార్ కూడా సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు.అయితే ఈ దర్శకుడు మాత్రం అప్పుడెప్పుడో షుగర్ ఫ్యాక్టరీ అంటూ ఒక సినిమా టైటిల్ రిజిస్టర్ చేయించినా ఇప్పటి వరకు దానిపై ఎలాంటి కదలిక లేదు.

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి నెక్స్ట్ సినిమా కేజీఎఫ్ స్టార్ రాకింగ్ స్టార్ యష్ తో పాన్ ఇండియా రేంజ్ లో హిస్టారికల్ కథాంశంతో సినిమా చేయబోతున్నాడు అని చర్చించుకుంటున్నారు.ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబందించి హీరో యష్ తో డిస్కషన్ కూడా జరిగిందని అతను కూడా నటించడానికి ఆసక్తిగానే ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రాధమిక చర్చలలో ఉన్న ఈ సినిమా గురించి పూర్తి స్థాయిలో క్లారిటీ త్వరలో వచ్చే అవకాశం ఉంది.బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ముందుకి వచ్చినట్లు తెలుస్తుంది.

దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాలంటే కొంత కాలం ఎదురుచూడాల్సిందే.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు