సీఎం కేసీఆర్ టార్గెట్ గా ఏపీ టీడీపీ..!

జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.ఏపీలో టీడీపీ టార్గెట్ గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

దీనిలో భాగంగా ముందుగా శ్రీకాకుళం, కడప, విజయనగరం జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారని సమాచారం.బీఆర్ఎస్ పార్టీలో చేరాలంటూ ఏపీ టీడీపీ నేతలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా గత లోక్ సభ ఎన్నికల్లో ఏపీ నుంచి నుంచి పోటీ చేసి ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న నేతలతో మంతనాలు కూడా సాగుతున్నయా అంటు అవుననే వాదనలే వినిపిస్తున్నాయి.ఇప్పటికే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తోనూ సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

మరోవైపు ఏపీని టార్గెట్ చేసి తెలంగాణ మంత్రులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా ఇందులో భాగమేననే అనుమానాలు సర్వత్రా వెలువడుతున్నాయి.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు