కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన పరిషత్ ఎన్నికలను మద్యలోనే వదిలేసిన విషయం తెల్సిందే.ఏపీ కొత్త సీఎస్ గా నీలం సాహ్ని పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిషత్ ఎన్నికలు పూర్తి చేసేందుక హడావుడిగా పాత నోటిఫికేషన్ ప్రకారం వెళ్లాలంటూ మళ్లీ అదే నోటిఫికేషన్ ను డేట్లు మార్చి వేయడం పట్ల హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను నిలిపి వేయాల్సిందిగా ఆదేశించింది.
ఎన్నికలు నిలిపివేస్తూ కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో విపక్ష పార్టీలన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సమయంలో ఏపీ ఎస్ఈసీ వారు హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లారు.సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ డివిజన్ బెంచ్ కు వెళ్లిన నేపథ్యంలో ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
డివిజన్ బెంచ్ లో కూడా ఎన్నికల నిర్వహణకు అనుమతులు రాకుంటే సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు.