ఏపీ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టనున్నారు.ఈ మేరకు ఈనెల 17 వ తేదీ నుంచి 30 వరకు దశలవారీగా నిర్వహించనున్నారు.
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శాంతియుతంగా ఉద్యమాలు చేపట్టేందుకు ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.గత నాలుగేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నారన్నారు.
కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఉద్యోగులు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగులను అణిచివేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.అయిత మరోసారి ఛలో విజయవాడ లాంటి ఆలోచన రాకముందే ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.







