పీవీ సింధు నీ అభినందించిన ఏపీ సీఎం జగన్..!!

ఒలంపిక్స్ బ్యాడ్మింటన్ క్రీడావిభాగంలో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు నీ సీఎం జగన్ అభినందించారు.శుక్రవారం సింధు సీఎం జగన్ ని కలవడం జరిగింది.

ఈ సందర్భంగా ఆమెను సత్కరించి అభినందనలు తెలియజేశారు.వెంటనే విశాఖలో అకాడమీ స్టార్ట్ చేయాలని సింధుకి తెలియజేశారు.

రాష్ట్రంలో మరింత మంది సిందు లను తయారు చేయాలని పీవీ సింధు కి తెలియజేసి ప్రభుత్వం తరఫున 30 లక్షల నగదును అందజేశారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏపీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని తెలిపారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ గారిని కలవడం చాలా సంతోషంగా ఉందని వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు ఆయన ను కలవడం జరిగింది అని బెస్ట్ విషెస్ తెలియజేశారని మెడల్ తీసుకురావాలని తెలిపారని సింధు పేర్కొన్నారు.అంతేకాకుండా ఉద్యోగాలలో 2% స్పోర్ట్స్ కి ఏపీ ప్రభుత్వం రిజర్వేషన్ కల్పిం చడం నిజంగా హర్షించదగ్గ విషయమని అన్నారు.

Advertisement

అకాడమి ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం మంజూరు చేసిందనీ, త్వరలోనే అకాడమి ప్రారంభిస్తానని తెలిపారు. 2024 ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు