ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై బిజెపి అగ్ర నేతలతో సోమువీర్రాజు చర్చించనున్నారు, ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై పార్టీ అధిష్టానానికి సోమువీర్రాజు వివరించి చెప్పారు.తిరిగి ఈరోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడకు చేరుకొని బిజెపి నేతలతో సమావేశాన్ని నిర్వహించి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలను సోమువీర్రాజు వివరించనున్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే టిడిపి అగ్రనేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలయిక నేపథ్యంలో బిజెపి సరికొత్త రాజకీయ వ్యవహారాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.