డి‌జి‌పి సవాంగ్ ను వెంటనే సస్పెండ్ చెయ్యాలి

ఆంధ్రప్రదేశ్ బి‌జే‌పి అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు ఉదయం విశాకపట్నంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ పై విమర్శలు చేశాడు.ఆలయాల పై దాడులు, విగ్రహాల ద్వంసం విషయమై బి‌జే‌పి కార్యకర్తలపై కేసులు పెట్టడం పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 Ap Bjp Leader Fire On Djp Gautham Savang, Ap Dgp, Ap Government, Gowtham Savang,-TeluguStop.com

ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ పై తక్షణమే చర్యలు తీసుకొని పదవి నుండి సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి కి సూచించాడు.అలాగే హిందువుల ఆలయ ఆదాయాలను లెక్క పెడుతున్న ప్రభుత్వం చర్చిల ద్వారా వస్తున్న ఆదాయం ఎంతో చెప్పాలని డిమాండ్ చేశాడు.

వైసీపీ ప్రభుత్వం బలవంతపు మత మార్పిడిలకు పాల్పడుతుందని అన్నాడు.ఆలయాలపై దాడులు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా బి‌జే‌పి కార్యకర్తలపై పోలీసు కేసులు పెట్టడం వెనుక వైసీపీ లక్ష్యం ఏమిటి అని ప్రశ్నించాడు.

రామతీర్థంలో రాముడి విగ్రహా ద్వంసం, అంతర్వేది రథం దగ్దం వంటి సంఘటనలపై పోలీసులు చర్యలు తీసుకోకుండా బి‌జే‌పి నాయకులపై కేసులు పెట్టడం వెనుక డి‌జి‌పి కుట్ర ఉన్నదని, ఆయన వెనకాల కనిపించని రాజకీయ శక్తులు ఉన్నాయని సోము అన్నాడు.తక్షణమే డి‌జి‌పి సవాంగ్ ను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశాడు.

ఈ విషయం ను కేంద్ర ప్రభుత్వం వరకు తీసుకుపోతం అని హెచ్చరించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube