ఏపీ అసెంబ్లీ సమావేశాలు త్వరలో ప్రారంభంకానున్నాయి.ఈ మేరకు మార్చి 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయని ప్రభుత్వం తెలిపింది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మొదటిరోజు గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.అదేవిధంగా సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.