1.ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
2.సోనియా పై గద్దర్ ప్రశంసలు

భౌగోళిక తెలంగాణ తీసుకు రావడంలో సోనియాగాంధీ పాత్ర గొప్పదని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు.
3.ములుగులో మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
4.మూసి పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

భాగ్యనగరంలో జంట జలాశయాల గేట్లు ఎత్తు వేయడంతో మూసికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.దీంతో అధికారులు మూసి పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.
5.గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్ష
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి ఈరోజు ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో దీనిని నిరసిస్తూ నేడు గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
6.ఈటెల రాజేందర్ పై కౌశిక్ రెడ్డి విమర్శలు

బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.కెసిఆర్ కాలిగోటికి కూడా రాజేందర్ సరిపోడని ఆయన మండిపడ్డారు.
7.సిఐ నాగేశ్వరావు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
మహిళపై అత్యాచారం కేసులో మాజీ నాగేశ్వరావు మెయిల్ పిటిషన్ పై మంగళవారం హయత్ నగర్ కోర్టు విచారణ జరపనుంది.
8.కేఏ పాల్ కామెంట్స్

తమ పార్టీ అధికారంలోకి వస్తే 60 వేల కోట్లతో ఏపీ ని అభివృద్ధి చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
9.తిరుపతిలో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించింది.
10.పాడేరులో ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ధర్నా

పాడేరులో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ధర్నాకు దిగింది.జీవో నెంబర్ 117 ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
11.టిడిపి నేత బోండా ఉమా హౌస్ అరెస్ట్
టిడిపి పోలీస్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ను పోలీసులు అరెస్ట్ చేశారు.దళిత గర్జనకు వెళ్ళనీయకుండా బోండా ఉమాను గృహనిర్బంధం చేశారు.
12.జనసేన పార్టీ నాయకుల అరెస్టు

ఏపీ సీఎం జగన్ పర్యటన నేడు కోనసీమ జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల కు చెందిన జనసేన కీలక నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు
13.ప్రభుత్వం తీరు వల్లే కోనసీమ అల్లర్లు : కోనసీమ జేఏసీ
ప్రభుత్వం తీరు వల్లే కోనసీమ అల్లర్లు జరిగాయని కోనసీమ జేఏసీ నేతలు విమర్శించారు.
14.రాష్ట్రపతిని కలవనున్న ఏపీ గవర్నర్

నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కలవనున్నారు.
15.19 మంది ఎంపీల సస్పెన్షన్
మంగళవారం రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో 19 మంది విపక్షాలకు చెందిన ఎంపీలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సస్పెండ్ చేశారు.
16.గవర్నర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే విమర్శలు

తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శలు చేశారు.క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడడానికి గవర్నర్ ఏమైనా శాస్త్రవేత్త అంటూ సుమన్ ప్రశ్నించారు.
17.పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ మనీ లాండ్రింగ్ కేసులో ఈరోజు సోనియా గాంధీని ఈడి అధికారులు ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
18.బీహార్ సీఎంకు కరోనా

బీహార్ సీఎం నితీష్ కుమార్ కు మరోసారి కరోనా సోకింది.
19.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 14,830 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
20.సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ తన ఆన్లైన్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది.
.