లి ఏపీలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు డిమాండ్ చేశారు.
విజయవాడ కేంద్రంగా త్వరలో రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం ప్రారంభం కానుంది.ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు రీజనల్ పాస్ పోర్ట్ అధికారి శివ హర్ష.
తాము ప్రతీకార రాజకీయాలు చేయలేదని , అలా చేసి ఉంటే డబ్బు కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి( Revanth reddy ) ఈపాటికి ఊచలు లెక్కపెట్టేవారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
రాజాధిక అమృత్ మహోత్సవాల్లో భాగంగా నా మట్టి నాదేశం కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అమృత్ కలస యాత్ర ప్రారంభమైంది.
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు అయ్యి నేటికీ 50 రోజులు పూర్తయింది .నేడు చంద్రబాబుతో లోకేష్ భువనేశ్వరిలు ములకత్ కానున్నారు.
రేపటి నుంచి టిడిపి జనసేన సమన్వయ సమావేశాలు ప్రారంభం కానన్నాయి.ఈనెల 29 ,30, 31 తేదీల్లో ఈ సమావేశాలు జరుగుతాయి.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ అనుమతి లేకుండా చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయలేరని నారాయణ అన్నారు.
తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం మొదలైంది దీంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు.
టిడిపి నేత చంద్రబాబు రాజమండ్రి జైలులో తన భద్రత ఆరోగ్యం పై ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాసిన నేపథ్యంలో దీనిపై జైలు శాఖ డిఐజి రవికిరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబుకు 24 గంటలు మొదటి నుంచి సెక్యూరిటీ ఏర్పాటు చేశామని అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
పొరపాలక పట్టణ అభివృద్ధి శాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
మోసం దగాకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
చంద్రబాబును చంపేస్తామని బహిరంగంగానే వైసీపీ నాయకులు చెబుతున్నారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరిది నిలకడ లేని రాజకీయమని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి విమర్శించారు.
పార్టీలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బిజెపి నేత బాబు మోహన్ ప్రకటించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి ఇటలీకి బయలుదేరి వెళ్లారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు కల్వకుంట్ల కుటుంబంలోని వ్యక్తి సీఎం అవుతారని బిజెపి నేత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Etela Rajender ) విమర్శించారు.
మంత్రి పదవి ఇవ్వకపోతే తుమ్మల ఇప్పటికే రాజకీయాలనుంచి రిటైర్ అయ్యే వారిని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు.
మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పిల్లర్లు కుంగిని ఘటనపై మరింత సమాచారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది.
కెసిఆర్ కు తానే మంత్రి పదవి ఇప్పించాలని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరావు( Thummala Nageswara Rao ) అన్నారు.
ఏపీలో సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy