న్యూస్ రౌండప్ టాప్ 20

1.కవితపై నారాయణ కామెంట్

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తెను కాపాడేది బిజెపి ప్రభుత్వం కాదా అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు.

2.చంద్రబాబు బెయిల్ పిటిషన్ లపై కొనసాగుతున్న విచారణ

ఎన్నర్ రింగ్ రోడ్డు,  అంగళ్లు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

3.తెలంగాణలో సింగరేణి ఎన్నికలు వాయిదా

తెలంగాణలో ఈనెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ ఎన్నికలను వాయిదా వేయాలన్న సింగరేణి అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది.

4.సినీ నిర్మాత కార్యాలయంలో ఐటీ సోదాలు

సినీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో ఐటి  సోదాలు జరుగుతున్నాయి.లావాదేవీలు, పన్ను  చెల్లింపుల రికార్డులను ఐటి అధికారులు పరిశీలిస్తున్నారు.

5.జానారెడ్డికి కీలక బాధ్యతలు

తెలంగాణ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు,  నేతల మధ్య సయోధ్య కోసం మాజీ మంత్రి జానారెడ్డికి కాంగ్రెస్ ఫోర్ మెన్ కమిటీ బాధ్యతలు అధిష్టానం అప్పగించింది.

6.రెండో రోజు సీఐడీ విచారణ

Advertisement

రెండో రోజు సిఐడి విచారణకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు.

7.త్వరలోనే నవీ ముంబైలో శ్రీవారి ఆలయం

నవీ ముంబైలో త్వరలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సింగానియా గ్రూప్ ముందుకొచ్చింది.

8.వివో కేసులో లావా ఎండీ అరెస్ట్

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో పై జరుగుతున్న మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు లో భాగంగా నలుగురు వ్యక్తులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.

9.హీరో నవదీప్ విచారణ

మాదక దరవ్యాల వ్యవహారంలో సినీ నటుడు నవదీప్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎనిమిది గంటలపాటు విచారించింది.

10.చంద్రబాబుకు హైకోర్టులో ఊరట

టిడిపి నేత చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది.చంద్రబాబు పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది .అంగళ్ళ కేసులో రేపటి వరకు, ఇన్నర్  రింగ్ రోడ్డు స్కాం లో సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.

11.ఓటుకు నోటు కేసు

ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

12.మంత్రి రోజా కుమార్తె విజ్ఞప్తి

ఇటీవల ఏపీ మంత్రి ఆర్కే రోజా పై టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.తాజాగా ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా రోజా కుమార్తె స్పందించారు.ఈ వ్యవహారం పై తన తల్లి తీవ్రంగా బాధపడుతోందని, ఆమెను అలా చూడలేకపోతున్నానని రోజా కుమార్తె వ్యాఖ్యానించారు.

13.ఇంటిలిజెన్స్ బ్యూరో లో ఖాళీలు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటిలిజెన్స్ బ్యూరో  దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటిలిజెన్స్ బ్యూరోలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 677 సెక్యూరిటీ అసిస్టెంట్ , మోటార్ ట్రాన్స్పోర్ట్ , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

14.ఎస్సీ వర్గీకరణ పిటిషన్

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అంశం,  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ పంజాబ్ వర్సెస్ రవీందర్ సింగ్ కేసుకు అటాచ్ చేసింది.

15.భట్టి విక్రమార్క కామెంట్స్

తెలంగాణ ప్రజలు దోపిడీ ప్రభుత్వం పాలనను వదిలించుకుని , ఇందిర పాలన కోసం ఎదురుచూస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టు విక్రమార్క అన్నారు.

16.మొక్కులు తీర్చుకున్న కిషన్ రెడ్డి

Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోది ములుగుకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చినందుకుగాను,  బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడారంలోని సమ్మక్క సారక్క అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు.

17.మంత్రి కేటీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి చార్టెడ్ అకౌంటెంట్, కాంగ్రెస్ నేత వేణుగోపాలస్వామి ఫిర్యాదు చేశారు.కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నుంచి డబ్బులు తీసుకోవాల్సిందిగా ప్రజలను కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

18.ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆర్టీసీ 695 పాదనపు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రీజనల్ మేనేజర్ సిహెచ్ వెంకన్న తెలిపారు.

19.పేదల ద్రోహి జగన్

పేదల ద్రోహి జగన్ అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు.

20.ఫైబర్ నెట్ పై టీడీపీ పుస్తకం

ఫైబర్ నెట్ పై వ్యవహారం పై టీడీపీ పుస్తకం విడుదల చేసింది.

తాజా వార్తలు