న్యూస్ రౌండప్ టాప్ 20 

1.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,27,952 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

2.హైదరాబాద్ కు ప్రధాని మోది

 

నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ కు రానున్నారు. 

3.ప్రతి పేదవాడికి ఆరు వేలు : రాహుల్

 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి ఆరు వేలు అందిస్తామని గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. 

4.రాజ్యాంగం వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన

  భారత రాజ్యాంగాన్ని సవరించాలి అంటూ చెప్పడం అంబేద్కర్ ను అవమానించడం ఎలా అవుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. 

5.ఇకపై సినిమాలు చేయను : రాహుల్ రామకృష్ణ

 

Advertisement

2022 తర్వాత సినిమాల్లో నటించేది లేదని సినీ హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ అన్నారు. 

6.సీనియర్ నేత జంగారెడ్డి మృతి

 

బిజెపి సీనియర్ నేత , మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. 

7.జడ్ ప్లస్ కేటగిరి భద్రత నాకొద్దు : అసదుద్దీన్ ఒవైసీ

  తనకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత తనకు అవసరం లేదని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 

8.హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందే

 

జిల్లా కేంద్రంగా హిందూపురం ను ప్రకటించాల్సిందేనని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు.లేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని మరోసారి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. 

9.ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా : షర్మిల డిమాండ్

  నిరుద్యోగులు ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగించే అంశమని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా అంటూ షర్మిల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 

10.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 28,410 మంది భక్తులు దర్శించుకున్నారు. 

11.బాసరలో భక్తుల రద్దీ

  తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయం లో భక్తుల రద్దీ పెరిగింది.భారీగా అక్షరాభ్యాసం పూజలు నిర్వహిస్తున్నారు. 

12.వేములవాడ రాజన్న క్షేత్రం లో భక్తుల రద్దీ

 వేములవాడ రాజన్న క్షేత్రం లో భక్తుల రద్దీ పెరిగింది.మేడారం సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో  వేములవాడకు భక్తుల రద్దీ పెరిగింది. 

13.అపోలో చైర్మన్ కు ప్రధాని పుట్టినరోజు శుభాకాంక్షలు

 

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
కొత్త పార్టీ పెట్టేస్తున్న ప్రశాంత్ కిషోర్ .. పేరేంటంటే ?

అపోలో ఆస్పత్రుల గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

14.16 నుంచి కృష్ణా బోర్డు ప్రాజెక్టుల సందర్శన

  ఈ నెల 16 నుంచి కృష్ణ బోర్డ్ ప్రాజెక్టుల ను సందర్శించనుంది. 

15.మార్చి లో అపెక్స్ కమిటీ సమావేశం

 కృష్ణ  గోదావరి, నదులపై నిర్మించిన  ప్రాజెక్ట్ లను బోర్డ్ లకు  అప్పగించే గెజిట్ అమలు పై చర్చించేందుకు మార్చిలో అపెక్స్ కమిటీ భేటీ కానుంది. 

16.అమెరికా లో ఈవెంట్ ప్లాన్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ బృందం

 

Advertisement

అమెరికాలో ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తోంది. 

17.ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయి

 

ఉద్యోగుల సమస్యలు ఈరోజుతో పరిష్కారం కానున్నాయని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. 

18.ఏపీలో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

19.రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 

ఇంకోసారి రాజ్యాంగం గురించి కెసిఆర్ మాట్లాడితే రాళ్లతో కొట్టి ఇస్తానని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు చేశార. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 45,100   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,200.

తాజా వార్తలు