ఇప్పటికి నా కల నెరవేరింది అంటున్న అనుపమ పరమేశ్వరన్‌...!

అ.ఆ.

సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తన నటన, అందచందాలతో తెలుగు అభిమానులను, అందులో ముఖ్యంగా కుర్రకారును అమాంతం తన ఫ్యాన్స్ గా మార్చేసుకుంది.

ఆవిడ స్క్రీన్ మీద ఎంత బాగా నటనలో జీవిస్తుందో, అలాగే సినిమా దర్శకత్వం చేయాలనే కోరిక కూడా చాలా బలంగా ఉందని, ఎప్పటికైనా దర్శకత్వం చేయాలని తన కోరిక ఉందని తెలిపింది.అందుకే తాజాగా తాను మలయాళ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సినిమా మనియారాయిలే అశోకన్ అనే మలయాళ సినిమాకి సహాయ దర్శకురాలిగా పని చేస్తోంది.

స్క్రీన్ మీద ఎంతో అందంగా కనిపించే ఈవిడ తన నటన ఎంతలా జీవి చేస్తుందో అదే స్థాయిలో సహా దర్శకురాలు కూడా పని చేస్తోంది.నిజానికి తనకు దర్శకత్వంపై చాలా ఇష్టం ఉండడం తోనే తాను ఇలా సహా దర్శకురాలుగా చేయడం చాలా సంతోషంగా ఉందని తెలుపుతోంది.

Advertisement

నిజానికి తెరపై కనిపించే అద్భుత దృశ్యానికి దిశానిర్దేశం చేసేది తెరవెనుకే అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడంతో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా తాను పాలుపంచుకున్నట్లు తెలిపింది.ఇలా చేసిన సమయంలో తాను ఎంతో ఇష్టపడి పని చేశాను కాబట్టి సెట్స్ లో ఎప్పుడు కష్టంగా అనిపించలేదు అంటూ తెలిపింది.

ఇకపోతే తాను ఎప్పటి నుంచో అనుకుంటున్న విధంగా దర్శక విభాగంలో పని చేయాలనే కోరిక ఇప్పటికి ఆ కల నెరవేరిందని తెలిపింది.భవిష్యత్తులో కచ్చితంగా కనీసం ఒక్క సినిమా అయినా సరే దర్శకత్వం చేస్తా అని ఎంతో ధీమాతో చెబుతుంది అనుపమ.

ఇక తాజాగా అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో యంగ్ హీరో నిఖిల్ తో కలిసి పని చేయనుంది.గతంలో కుమారి 21ఎఫ్ సినిమాకు దర్శకత్వం వహించిన పల్నాటి సూర్య ప్రతాప్ తాజాగా 18 పేజెస్ అనే సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు