ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్( Instagram ) యూజర్ ఎంగేజ్మెంట్ పెంచడానికి సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది.తాజాగా కామెంట్ సెక్షన్లో పోల్స్ ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యింది.
ఈ స్పెసిఫికేషన్తో యూజర్లు తమ పోస్ట్లు, రీల్స్ కింద పోల్స్ను క్రియేట్ చేయవచ్చు, ఇతరుల క్రియేట్ చేసిన పోల్స్ లో వోట్ చేయవచ్చు, అదే విధంగా స్టోరీస్ లోనూ ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.దీనివల్ల యూజర్ ఎంగేజ్మెంట్ బాగా పెరుగుతుందని ఇన్స్టాగ్రామ్ సంస్థ భావిస్తోంది.
ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి ( Adam Mosseri ) ఈ ఫీచర్ను ప్రకటించారు, ఇది ఇప్పటికీ లిమిటెడ్ టెస్టింగ్ ఫేజ్లో ఉంది.అయితే త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు.
పోల్స్ ఎంతకాలం ఓపెన్ అయి ఉంటాయి? వినియోగదారులు వాటికి వేర్వేరు వ్యవధిని సెట్ చేయగలరా? అనే సందేహాలకు ప్రస్తుతానికి సమాధానం లేదు.

మరోవైపు మెటా( Meta ) ఇన్స్టాగ్రామ్లో వినియోగదారులకు వారి డేటా ప్రైవసీపై మరింత నియంత్రణను ఇస్తోంది.వినియోగదారులు ఇప్పుడు ఇతర యాప్లు, వెబ్సైట్లలో వారి యాక్టివిటీస్ను ఇన్స్టాగ్రామ్ ట్రాక్ చేయకుండా నిలిపివేయవచ్చు.మెటాతో వ్యాపారాలు ఏ సమాచారాన్ని షేర్ చేస్తున్నాయో చూడడానికి, వారి ఖాతాల నుంచి వాటిని తొలగించడానికి లేదా డిస్కనెక్ట్ చేయడానికి ఈ ఫీచర్ను యూజర్లు ఉపయోగించవచ్చు.

ఇన్స్టాగ్రామ్ భారతదేశంలోని దాని Gen Z యూజర్ల కోసం నాలుగు కొత్త ఫీచర్లపై కూడా పనిచేస్తోంది.ఈ ఫీచర్లు ఏంటంటే, పుట్టినరోజు, ఆడియో నోట్లు, సెల్ఫీ వీడియో నోట్లు, స్టోరీస్ లోని మల్టిపుల్ లిస్ట్స్.వినియోగదారులు తమను తాము క్రియేటివ్ గా ఎక్స్ప్రెస్ చేయడంలో, వారి స్నేహితులతో కనెక్ట్ అవ్వడంలో సహాయపడటానికి వీటిని కంపెనీ తీసుకొస్తోంది.ఇన్స్టాగ్రామ్ త్వరలో ఈ ఫీచర్లను పరీక్షించడం ప్రారంభించాలని యోచిస్తోంది.
ఈ కొత్త ఫీచర్లు గుర్గావ్లో జరిగిన IGUxDelhi అనే ఈవెంట్లో వెల్లడించబడ్డాయి, ఇక్కడ ప్లాట్ఫామ్ యొక్క భవిష్యత్తు కోసం ఇన్స్టాగ్రామ్ తన ప్రణాళికలను షేర్ చేసింది.







