బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) .ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటివరకు సీమయాసలో సీమ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి కథలలో బాలకృష్ణ నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.మొదట సారి బాలకృష్ణ తెలంగాణ యాసలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ విడుదలయి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఇప్పటికే ఈ సినిమా చూసినటువంటి ఎంతో మంది సెలబ్రెటీలు సినిమా పట్ల పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమాని నటి పూనమ్ కౌర్ ( Poonam Kaur ) చూశారు.భగవంత్ కేసరి సినిమా చూసిన తర్వాత ఈమె తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.భగవంత్ కేసరి చూసినందుకు చాలా రిఫ్రెషింగ్గా ఉంది.
ఈ సినిమా చూశాక నేను కూడా జై జై బాలయ్య బ్యాచ్లో చేరాలనుకుంటున్నాననీ ఈమె చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ సినిమా ఆమెకి ఎంతో నచ్చడంతో తాను కూడా బాలయ్య బ్యాచ్లో చేరాలనుకుంటున్నాను అని తెలియజేస్తూ ఈ ట్వీట్ చేయడంతో బాలయ్య అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దసరా పండుగ సందర్భంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో ముగ్గురు సినిమాలలోను బాలయ్య సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) నటించగా శ్రీ లీల ( Sreeleela ) కూడా బాలయ్యకు కూతురు పాత్రలో నటించారు.ఇక ఈ సినిమా తండ్రి కూతుర్ల నేపథ్యంలో వారి మధ్య ఉన్న అనుబంధం తెలియజేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.మొత్తానికి వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాలయ్య మరోసారిభగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు.