లాయర్లు మూడు పెళ్లిళ్లు చేసుకోండి... టీడీపీ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది.

ఇక ఈ వ్యవహారం మీద అధికార పార్టీ సమర్ధించుకుంటూ ఉంటే, విపక్షాలు మాత్రం ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నాయి.

అసలు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆందోళన చేస్తున్నారు.స్థానిక రైతులు కూడా అమరావతి రాజధానిగా ఉండాల్సిందే అంటూ పట్టుపడుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా రాజధాని విషయంపై మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారధి మాట్లాడుతూ న్యాయవాదుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ మధ్య కాలంలో అధికార పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ ని మూడు పెళ్ళిళ్ళు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దీనినే తీసుకొని ఏపీ రాజధానులు మూడు ఏర్పడితే న్యాయవాదులు కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.కర్నూలు హైకోర్టు, విజయవాడ, విశాఖ హైకోర్టు బెంబీల్లో న్యాయవాదులు పని చేయాలంటే ఒక్కొక్కరు మూడు వివాహాలు చేసుకోవాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Advertisement

మూడు పెళ్ళిళ్ళు చేసుకొని మూడు చోట్ల కాపురాలు పెట్టాలని అన్నారు.బీకే వ్యాఖ్యలపై ఇప్పుడు న్యాయవాదులు మండిపడుతున్నారు.

తమను అవమానించేలా బీజే వ్యాఖ్యలు ఉన్నాయని, తమకు వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.మరో వైపు ఆయన వ్యాఖ్యల మీద వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఒక్కరిని కించపరచడం టీడీపీ నేతలకి భాగా అలవాటని విమర్శిస్తున్నారు.

గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!
Advertisement

తాజా వార్తలు