అఖండ జీపుతో తన అభిమానాన్ని చాటుకున్న బాలకృష్ణ వీరాభిమాని

అనంతపురం జిల్లా తాడిపత్రిలో సినీ నటుడు బాలకృష్ణ వీరాభిమాని, తన అభిమానాన్ని చాటుకున్నారు.తాడిపత్రి బి.

హెచ్.మహల్‌లో హీరో బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ప్రదర్శన సందర్భంగా తాను ప్రత్యేకంగా తయారు చేయించుకున్న జీపును ప్రేక్షకుల ముందుకు  ఉంచి నటుడు బాలకృష్ణ మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

తాడిపత్రిలో‌ నటుడు బాలకృష్ణ వీరాభిమాని అయిన వేలూరు కృష్ణమూర్తి, 2019 సంవత్సరంలో ఈ జీపును బాలకృష్ణ అఖండ షూటింగులో చూసి, ఇలాంటి జీపును తీసుకోవాలని ఆసక్తితో హర్యానాలోని మండి డబీ అనే జీపు మార్కెట్లో ప్రత్యేకంగా తయారు చేయించి ఆర్డర్ చేసి దానిని  తాడిపత్రికి తెప్పించి అభిమానాన్ని చాటు కున్నారు.ఈ వాహనం తయారు చేయడానికి రెండు సంవత్సరాల కాలం పట్టిందని, నేటికి జీపు తయారీ పూర్తి కావడంతో, నేను ఈ వాహనంలో తిరుగుతున్నానని, అలా తిరగడం పట్ల, బాలకృష్ణతో కలిసి తిరిగినట్లు అనుభూతి కలుగుతుందని మీడియాతో తెలియజేసారు.

వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?
Advertisement

తాజా వార్తలు