మగాడిలా ఉన్నానని కామెంట్లు చేశారు.. హీరోయిన్ ఆవేదన..?

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్ల నుంచి చిన్న హీరోయిన్ల వరకు చాలామంది ట్రోలింగ్ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

దేశంలో రోజురోజుకు టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో సోషల్ మీడియా వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.

నెటిజన్లలో కొంతమంది హీరోయిన్లను టార్గెట్ చేస్తూ హీరోయిన్లను బాధించే విధంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే మీడియాతో మాట్లాడుతూ ట్రోలింగ్ వల్ల ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చారు.

నెటిజన్లలో కొంతమంది తన శరీరం మగాడి శరీరంలా ఉందని కామెంట్లు చేసేవారని అనన్య ఆవేదన వ్యక్తం చేశారు.అలా నెటిజన్లు చేసిన కామెంట్లు తనకు ఎంతో బాధను కలిగించాయని ఆమె అన్నారు.

హీరోయిన్ గా సినిమాల్లో కి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఇలాంటి ట్రోల్స్ ఎదురయ్యాయని అనన్య పాండే తెలిపారు.తాను బక్కగా, ఫ్లాట్ గా ఉన్నానని.

Advertisement

పురుషుల శరీరం ఎలా ఉందో తన శరీరం కూడా అలానే ఉందని పేర్కొనేవారని తెలిపారు.నెటిజన్ల ట్రోల్స్ వల్ల తాను కృంగిపోయానని అనన్య పాండే వెల్లడించారు.

ట్రోల్స్ తనను బలహీనురాలిగా మార్చాయని.ఆ తర్వాత తనను తాను లవ్ చేసుకుంటూ ట్రోల్స్ ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టానని ఆమె అన్నారు.

తనను బాధ పెట్టిన ట్రోల్స్ ను ఎంజాయ్ చేయడం నేర్చుకున్నానని అనన్య తెలిపారు.అలా మనం మారితే మాత్రమే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా బాధ కలగదని అనన్య పేర్కొన్నారు.

ప్రముఖ స్టార్ హీరో కూతురైన అనన్య పాండే స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో అనన్య హీరోయిన్ గా నటిస్తున్నారు.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు