తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy )కి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సవాల్ విసిరారు.కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాల పార్టీ అని ఆరోపించిన అమిత్ షా( Amit Shah ) దేశంలో కాంగ్రెస్ రూ.12 లక్షల కోట్ల అవినీతి చేసిందన్నారు.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అవినీతి చేయలేదని నిరూపించాలని ఛాలెంజ్ చేశారు.అలాగే మజ్లిస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆప్తమిత్రుడని ఆరోపించారు. హైదరాబాద్( Hyderabad ) పర్యటనకు వచ్చిన అమిత్ షా బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే.