టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు కూడా ఒకరు.మొదట డిస్ట్రిబ్యూటర్ గా మంచి గుర్తింపు పొందిన దిల్ రాజు నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు.
దిల్ రాజు సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమా పక్కా హిట్ అవుతుందని అందరికీ నమ్మకం ఉండేది.కానీ కొంత కాలంగా దిల్ రాజు పరిస్థితి తారుమారు అయింది.
కొంతకాలంగా దిల్ రాజు వరుస ప్లాప్ లను అందుకుంటున్నాడు.ఇటీవల విడుదలైన థాంక్యూ సినిమా కూడా దిల్ రాజుకి నష్టాలను మిగిల్చింది.
నాగచైతన్య రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన థాంక్యూ సినిమాకి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు.
అక్కినేని నాగచైతన్యని హీరోగా జోష్ సినిమా ద్వారా దిల్ రాజు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.ఆ సినిమా తర్వాత ఇంతకాలం గ్యాప్ తో మళ్లీ వీరిద్దరూ కలిసి థాంక్యూ సినిమా కోసం పనిచేశారు.
అయితే అప్పుడు జోష్ ఎలా ప్లాప్ అయ్యిందో ఇప్పుడు థాంక్యూ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.థాంక్యూ సినిమా రిలీజ్ అయిన నాటి నుండి ఇప్పటివరకు దాదాపు 24 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసింది.
అయితే ఈ సినిమా గురించి నెగటివ్ టాక్ ఉండటంతో బ్రేక్ ఈవెన్ అవడం అసాధ్యమని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.అసలే ప్లాప్ దెబ్బతో విచారంలో ఉన్న దిల్ రాజుకు థాంక్యూ సినిమాతో మరో దెబ్బ తగిలింది.

బయట సినిమా గురించి నెగటివ్ టాక్ రావడంతో ఎర్లీ ఓటీటీ రిలీజ్ ఇద్దామని దిల్ రాజు భావించారు.అయితే సినిమాలు ఇలా ఓటీటీ లో ఎర్లీ రిలీజ్ చేయటానికి ఓటీటీ సంస్ద ఎగస్ట్రా పే చేస్తుంది.అయితే ఈ రేంజి డిజాస్టర్ సినిమాకు వ్యూస్ రావని, కాబట్టి ఎర్లీ రిలీజ్ కు ఎగస్ట్రా పే చేయమని అమేజాన్ ప్రైమ్ సంస్ద తెగేసి చెప్పిందిట.అంతేకాకుండా గత కొన్ని రోజులుగా ఓటీటీ రిలీజ్ లకు ఎంత గ్యాప్ ఇవ్వాలి అనే విషయమై చర్చలు జరుగుతున్నాయి.
దీంతో థాంక్యూ సినిమా ఎర్లీ రిలీజ్ అంటే నిర్మాతల మండలి ఏమంటుందో అని దిల్ రాజు ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.మొత్తనికి థాంక్యూ ఓటీటీ రిలీజ్ కి అమెజాన్ ప్రైమ్ హ్యాండ్ ఇచ్చిందని సమచారం.







