అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ మూవీ ప్రమోషన్స్ లో అల్లరి నరేష్ తన కెరీర్ గురించి చెప్పుకొచ్చారు.
ఒకప్పుడు వరుస సినిమాలతో అదే రేంజ్ ఫలితాలతో బిజీగా ఉన్న అల్లరి నరేష్ ప్రస్తుతం కెరీర్ లో వెనకపడి ఉన్నాడు.నాంధి సినిమాతో హిట్ అందుకున్న నరేష్ అదే పంథాలో సీరియస్ సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు.
ప్రస్తుతం మోహన్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీపై చాలా నమ్మకంగా ఉన్నాడు నరేష్.
అయితే కెరీర్ లో వరుస ఫ్లాపులు వస్తున్న టైం లో నాన్న బ్రతికి ఉంటే ఇలా జరిగేది కాదని తన ఫ్లాపులకు ఆయనని ప్రస్తావిస్తూ కొందరు మాట్లాడుతుంటారని అప్పుడు తనని చాలా బాధకలుగుతుందని అన్నారు నరేష్.
ఇప్పటికీ తనని అలా అంటుంటారని అన్నారు అల్లరి నరేష్.సీరియస్ సినిమాలే కాదు కామెడీ ఎంటర్టైనర్స్ కూడా చేయడానికి సిద్ధమే కానీ అలాంటి కథలు రావట్లేదని అంటున్నారు నరేష్.
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి.