తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది.ఈ క్రమంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
అయితే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.కాగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల 94,620 మంది విద్యార్థులు ఎగ్జామ్ కు హాజరయ్యారు.