తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.2003లో విడుదలైన సంబరం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ పరిచయమైన నిఖిల్ ఆ తర్వాత తెలుగులో యువత, హ్యాపీ డేస్, రాజేష్ గా, కార్తికేయ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇకపోతే నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2.కార్తికేయ 1 సినిమాతో కామెడీ లవ్ స్టోరీ క్రైమ్ థ్రిల్లర్ ఇలా ఏ అంశంలోనైనా నటించే సత్తా ఉంది అని నిరూపించుకున్న నిఖిల్ ఇప్పుడు కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు.
చందు ముండేటి సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఈ నేపథం నూనె తాజా డైరెక్టర్ చందు మండేటి, హీరో నిఖిల్ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి కూడా పంచుకున్నారు హీరో నిఖిల్.
ఈ క్రమంలోనే ఆలీ ప్రశ్నిస్తూ.శ్రీదేవి అనే ఒక అమ్మాయి మీకు రాసిన లెటర్ గురించి చెబుతారా అని ప్రశ్నించగా.
ఆ విషయం పై స్పందించిన నిఖిల్.
అవునండి నేనొక నార్మల్ హీరోనీ.చిన్నప్పటి పవన్ కళ్యాణ్, చిరంజీవులను అభిమానిస్తూ ఈ స్థాయికి వచ్చాను.అటువంటి నాకు ఒక ఫ్యాన్ అంత అభిమానిస్తూ ఒక లెటర్ రాసేసరికి అది చదివి నేను బాగోద్వేగానికి గురయ్యాను.
లెటర్ చదవడం పూర్తి అయ్యేసరికి నా కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి.నేను నా ఫ్యాన్స్ ని ఫ్రెండ్స్ లాగే భావిస్తాను అంత అభిమానాన్ని నేను ఊహించలేదు అని చెప్పుకొచ్చాడు నిఖిల్.
కార్తికేయ 2 సినిమాలో అఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఆగస్టు 13న ఈ సినిమా విడుదల కానుంది.