ఎన్.టి.ఆర్ తర్వాత మహేష్ తో జాన్వి కపూర్..!

అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది.

అమ్మడికి సౌత్ సినిమాల మీద ఫోకస్ పెట్టాలనే ఆలోచన వచ్చింది.

ముఖ్యంగా తెలుగు సినిమాలు నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదిస్తున్న ఈ టైం లో జాన్వి కపూర్ తెలుగు సినిమాల మీద ఫోకస్ చేయాలని అనుకుంటుంది.ఇప్పటికే ఎన్.

టి.ఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో జాన్వి టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.

ఇక తారక్ సినిమా తర్వాత ఆ వెంటనే మహేష్ సినిమా ఛాన్స్ కూడా పట్టేసిందని అంటున్నారు.మహేష్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమాలో జాన్వి కపూర్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారట.

Advertisement

ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా ఫిక్స్ అని వార్తలు వచ్చినా ఇప్పుడు ఆమె ప్లేస్ లో జాన్వి కపూర్ నటిస్తుందని చెబుతున్నారు.తప్పకుండా మహేష్ తో జాన్వి సూపర్ హిట్ జోడీ అవుతుందని చెప్పొచ్చు.

తెలుగులో స్టార్ డం తెచ్చుకుంటే తెలుగు, హిందీ బైలింగ్వల్ లో ఆమె పాపులర్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు