ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల కలకలం మళ్లీ చెలరేగింది.తాజాగా భీంపూర్ మండలం తాంసిలో రెండు పులులు కనిపించాయని సమాచారం.
అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ పులుల దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు.మళ్లీ పులుల సంచరిస్తుండటంతో స్థానిక గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అటవీ శాఖ అధికారులు స్పందించి పులుల బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.