రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులకు చాలా మంది పొలాల్లో లూజు లైన్ల ద్వారా పంట పొలాల్లో చేతికందే ఎత్తులో ఎల్లమ్మ గుడి వద్ద గల పంట పొలాల్లో విద్యుత్ వైర్లు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని వాటిని సరి చేయాలనీ కోరుతూ ఎల్లమ్మ గుడి వద్ద గల రైతులు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ దృష్టికి తీసుకు వెళ్లగా స్పందించిన ఒగ్గు బాలరాజు యాదవ్
రైతులను వెంట తీసుకెళ్ళి సెస్ ఎ.డి నీ మరియు సెస్ ఏ.
ఈ పృథ్వి ధర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.ఎల్లమ్మ గుడి వద్ద మొత్తం 33 మంది రైతుల కరెంట్ బోర్లు ఉన్నాయని అక్కడ ఉన్న విద్యుత్ వైర్లు లూజు గా మారయని వాటిని సరిచేయడానికి సుమారు ఆరు మిడిల్ పోల్స్ వేయాలని సెస్ అధికారులతో మాట్లాడగా వారం రోజుల్లో మిడిల్ పోల్స్ వేసి ప్రమాదం జరగకుండా చూస్తామని సెస్ అధికారులు హామీ ఇచ్చారు.