బాలీవుడ్ ఇండస్ట్రీలో కంగనా రనౌత్ కు ఫైర్ బ్రాండ్ గా పేరుంది.కంగనా రనౌత్ లాక్ అప్ అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ షో అంచనాలను మించి సక్సెస్ కావడంతో పాటు మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.యూత్ లో ఈ షోకు అంచనాలకు మించి ఆదరణ దక్కుతోంది.
ఈ షోలో పాల్గొన్న నటీనటులు తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఈ షో ద్వారా ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.
తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో మందన కరిమి తన లైఫ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించి నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేశారు.
ఈ రియాలిటీ షోలో తమ సీక్రెట్లను వెల్లడించడం ద్వారా ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్లు సేవ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.మందన కరిమి మహిళా హక్కుల గురించి మాట్లాడే ఒక డైరెక్టర్ తో తనకు ఎఫైర్ ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
తాను, ఆ డైరెక్టర్ కలిసి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేశామని అయితే తాను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ దర్శకుడు మోసం చేశాడని ఆమె చెప్పుకొచ్చారు.
తన భర్తతో విడిపోతున్న సమయంలో ఈ ఎఫైర్ మొదలైందని ఆమె కామెంట్లు చేశారు.అయితే ఈ రియాలిటీ షో గురించి నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్ల కంటే నెగిటివ్ కామెంట్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి.రేటింగ్స్ కోసం ఛానెళ్ల నిరాహకులు దిగజారుతున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వాలు, అధికారులు రియాలిటీ షోల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సెలబ్రిటీలు సైతం ఇలాంటి రియాలిటీ షోలకు దూరంగా ఉండాలని నెటిజన్లు కోరుతున్నారు.ఇలాంటి రియాలిటీ షోలు యువతపై చెడు ప్రభావం చూపుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.