నేను బ్రతికుంటే మళ్లీ నటిస్తానని చెప్పాను.. నటి సుధ కామెంట్స్ వైరల్!

సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లో ఎక్కువగా నటించి నటి సుధ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు.

ఒక ఆర్టిస్ట్ మంచి పాత్రలు చేసిన తర్వాత చిన్నచిన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపరని సుధ పేర్కొన్నారు.

కొన్ని సినిమాలలో తాను నటించనని డైరెక్ట్ గా చెప్పానని సుధ వెల్లడించారు.క్యారెక్టర్ గుర్తుండిపోయే పాత్రలు మాత్రమే చేయాలని సుధ వెల్లడించారు.

అన్నపూర్ణమ్మకు నాకు ఎలాంటి గొడవలు లేవని ఆమెను తాను అత్త అని పిలుస్తానని సుధ అన్నారు.మా ఇంట్లో ఏది మంచి చెడు జరిగినా చంద్రమోహన్ ఫ్యామిలీ ఉంటుందని సుధ చెప్పుకొచ్చారు.

తనకు మంచి పాత్రలు పడ్డాయని అందువల్లే ఈ స్థాయిలో గుర్తింపు వచ్చిందని సుధ అన్నారు.మోహన్ బాబుకు అక్క పాత్రలో, బాలయ్యకు నాగార్జునకు తల్లి పాత్రలలో తాను నటించానని సుధ చెప్పుకొచ్చారు.

Advertisement

మలయాళంలో కూడా చాలామంది స్టార్ హీరోలకు తాను తల్లిగా నటించానని సుధ పేర్కొన్నారు.తాను మదర్ క్యారెక్టర్ చేసే సమయంలో చాలామంది కోప్పడ్డారని సుధ చెప్పుకొచ్చారు.

లైఫ్ లాంగ్ ఇండస్ట్రీలో ఉండాలని అనుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉండాలని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసినంత వరకు ఇండస్ట్రీలో ఉండవచ్చని సుధ తెలిపారు.పేరెంట్స్ నాకు హార్ట్ బీట్ అని సుధ వెల్లడించారు.

ప్రెసిడెంట్ గారి పెళ్లాం మూవీ షూటింగ్ సమయంలో మూడోరోజు అపెండిక్స్ ఆపరేషన్ అని ఆ సినిమా షెడ్యూల్ ను నాకోసం ఆపేసి తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాకోసం వచ్చారని సుధ చెప్పుకొచ్చారు.చిరంజీవి సైతం హ్యూమానిటీతో చూడటానికి వచ్చారని సుధ పేర్కొన్నారు.దొరస్వామిరాజుగారితో బ్రతికుంటే తిరిగి వచ్చి వర్క్ చేస్తానని తాను చెప్పానని సుధ అన్నారు.

ఆ సమయంలో దొరస్వామిరాజు నన్ను తిట్టారంటూ సుధ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు