కోలీవుడ్ స్టార్ కమెడియన్ ని మోసం చేసిన నిర్మాతలు

కోలీవుడ లో స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూరి.ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలలో కమెడియన్ గా అవకాశాలు తెచ్చుకుంటున్న సూరి తాజాగా పోలీసులని ఆశ్రయించాడు.

ఇద్దరు నిర్మాతలు తనను మోసం చేశారని, ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని భూమిని తనకి కట్టబెట్టి 2.70 కోట్ల మేర మోసం చేశారని పోలీసులకు తెలిపాడు.వీరధీర సూరన్ అనే చిత్రాన్ని నిర్మించిన అడయార్ ప్రాంతానికి చెందిన రమేశ్ అన్బువేల్ రాజన్ చిత్రంలో నటించినందుకు 40 లక్షలు చెల్లించేలా సూరితో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఆ తర్వాత కొంత డబ్బును సమకూర్చితే సిరుచేరి ప్రాంతంలో భూములు కొని, రిజిస్టర్ చేయిస్తామని సూరికి చెప్పారు.వారి మాటలను నమ్మిన సూరి వాయిదాల రూపంలో 2 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాడు.

సదరు నిర్మాతలు చూపించిన భూములను పరిశీలించిన సూరి వాటికి రోడ్డు సౌకర్యం లేదని, పట్టా కూడా లేదని గుర్తించాడు.దీంతో, తాను ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని అడిగాడు.

డబ్బును తిరిగి చెల్లిస్తామని సూరికి వారు అగ్రిమెంట్ కూడా చేశారు.ఒప్పందం మేరకు డబ్బును చెల్లించకపోవడంతో అడయార్ పోలీసులకు సూరి ఫిర్యాదు చేశాడు.

Advertisement

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.రిజిస్ట్రేషన్ లేని భూమిని తనకి అమ్మేయాలని చూసారని ఫిర్యాదులో సూరి పేర్కొన్నారు.

ఇప్పుడు ఈ కేసుకి సంబందించిన వార్త కోలీవుడ్ లో సంచలనంగా మారింది.ఈ గొడవలోకి హీరో విష్ణు విశాల్ తండ్రి పేరు కూడా చేర్చి ప్రచారం చేయడంపై అతను సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు