ఎస్పీపై చర్యలు తీసుకోవాలి:సంకినేని

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో జరిగిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా బాధ్యతగల అధికారిగా ఉన్న సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్.

రాజేంద్రప్రసాద్ మంత్రి జగదీష్ రెడ్డికి జేజేలు కొట్టడమే కాక ప్రజలందరి చేత జై కొట్టించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని,మంత్రి అనుచరునిలాగా జిల్లా ఎస్పీ నినాదాలు ఇవ్వడం సరైన విధానం కాదని,ఒక పార్టీ కార్యకర్త మాదిరిగా జిల్లా ఎస్పీ వ్యవహరించడం అనేది ప్రజలు,ప్రజాస్వామ్యవాదులు హర్షించరని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.

పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి జిల్లా ఎస్పీపై చర్యలు తీసుకోవాలని,ఒక జిల్లా ఎస్పీ ఒక నాయకునికి,ఒక పార్టీకి,ఇంత బహిరంగంగా వత్తాసు పలుకుతుంటే ఇక సామాన్య ప్రజలకు జిల్లాలో ఎలా న్యాయం జరుగుతుందని సంకినేని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వరదలతో ఛిద్రమైన తొగర్రాయి గ్రామం...!

Latest Suryapet News