ఆచార్యలో అయిదుగురు.. మామూలుగా ఉండదట!

మెగాస్టార్ చిరంజీవి గతేడాది సైరా చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆ సినిమా తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ చెప్పిన ఓ కథ బాగా నచ్చడంతో ఆచార్య సినిమాకు పచ్చజెండా ఊపాడు.

కాగా ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.అయితే ఈ సినిమాలో చిరు ఓ సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత త్రిషను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించినా, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుండి వాకౌట్ అయ్యింది.దీంతో అందాల భామ కాజల్ అగర్వాల్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సిందిగా చిత్ర యూనిట్ కోరడం, ఆమె కూడా వెంటనే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోవడం జరిగిపోయాయి.

ఇక ఈ సినిమాలో చిరు డ్యుయెల్ రోల్ చేస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.ఈ క్రమంలోనే చరణ్‌కు జోడీగా కీర్తి సురేష్ లేదా కియారా అద్వానీని తీసుకోవాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది.

Advertisement

కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా చిందులు వేయనుందని, హాట్ యాంకర్ అనసూయ కూడా ఓ సాంగ్‌లో కనిపించనుంది.అయితే ఇప్పటికే చిరు, రెజీనాల మధ్య ఓ అదిరిపోయే సాంగ్‌ను షూట్ చేశారు చిత్ర యూనిట్.

ఇలా ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు భామలు కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఏదేమైనా చిరు సినిమాలో ఇంతమంది హీరోయిన్లు ఉండటంతో మెగా ఫ్యాన్స్ రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు