ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్కు విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.ఈ మేరకు టెరాసాఫ్ట్, ఎండీ వేమూరి హరిప్రసాద్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తుల అటాచ్మెంట్కు కోర్టు అంగీకారం తెలిపింది.
కేసులో మొత్తం ఏడుగురి ఆస్తుల అటాచ్మెంట్కు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.అయితే రూ.114 కోట్ల విలువ చేసే ఆస్తులను ఎటాచ్ చేసే ఆదేశాలు ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు అటాట్ మెంట్ అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.