ఢిల్లీ మెట్రో ట్రైన్లో ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవకు సంబంధించి ఓ వీడియో వైరల్గా మారింది.ఈ వీడియోను బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గా( Tajinder Pal Singh Bagga ) ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
వీడియోలో ఇద్దరు మహిళలు ఒకరికొకరు తిట్టుకోవడం చూడవచ్చు.కాసేపటికి వారిలో ఒకరు తన హ్యాండ్ బ్యాగ్ నుంచి పెప్పర్ స్ప్రే తీసి మరొకరిని బెదిరించింది.
వారి మధ్య వాగ్వాదం ముదరడంతో ఒక మహిళ మరొక మహిళపై పెప్పర్ స్ప్రే( Pepper spray ) ప్రయోగించింది.బాధితురాలు ఆమెను పెప్పర్ స్ప్రే కొట్టకుండా నిలువరించేందుకు ప్రయత్నించింది కానీ విఫలమైంది.
స్ప్రే తనపై పడకుండా ఆమె చాలా ట్రై చేసింది కానీ ఫలితం లేకుండా పోయింది.పెప్పర్ ముఖంపై పడటంతో దాని ప్రభావానికి ఆమె దగ్గుతున్నట్లు వీడియోలో కనిపించింది.
ఈ ఇద్దరు మహిళలు ఎందుకు గొడవ పడ్డారో స్పష్టంగా తెలియదు.రైలు కోచ్లోనే వీరి నడుమ గొడవ మొదలైనట్లు తెలుస్తోంది.ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ కాగా చాలా మంది నెటిజన్లు మహిళల ప్రవర్తనపై విమర్శలు గుప్పించారు.వారి ప్రవర్తన అనాగరికంగా, అసహ్యంగా ఉందన్నారు.తోటి ప్రయాణికులతో సర్దుకుపోకుండా చిల్లరగా గొడవలకు దిగి అందరికీ ఇబ్బందులు కలిగిస్తున్నారని కామెంట్స్ చేశారు.
ఇక ముంబైలోని లోకల్ ట్రైన్ లేడీస్ కంపార్ట్మెంట్లలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమని ట్విట్టర్ యూజర్ ఒకరు అన్నారు.మొత్తం మీద ఈ ఘటన ప్రజా రవాణాలో మహిళల భద్రతపై మరోసారి ఆందోళన రేకెత్తించింది.ఇలాంటి సంఘటనలు జరగకుండా మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.